మిస్టర్ ఇండియా పోటీల్లో మెరిసిన పాలమూరు తెలుగు తేజం.





పాలమూరు జిల్లా నవాబుపేట్  మండలానికి   చెందిన రాకేష్  మిస్టర్ ఇండియా పోటీల్లో తన సత్తా చాటాడు.
దాదాపు ఇందులో 27 రాష్ట్రాల నుండి వేలకు పైగా యువకులు మిస్టర్ ఇండియా కోసం పోటీ పడగా.
మన తెలుగు తేజం అయిన రాకేష్ అందరినీ వెనక్కు నెట్టి  మిస్టర్ ఇండియా రన్నరప్ గా నిలిచాడు.
దానితోపాటు ఇంకా రెండు సబ్ టైటిల్స్  వచ్చాయి
మిస్టర్ ఇండియా 2020 పాపులర్ ఫేస్
 మిస్టర్ ఇండియా 2020 బెస్ట్ బాడీ
అదే విధంగా అంతర్జాతీయ పోటీలకు ఎంపిక అయ్యాడు.


ఈ పోటీ కోసం దాదాపుగా మూడు సంవత్సరాలు కష్టపడ్డానని చెప్పాడు.
మారూమూల  పల్లెటూర్లో నుండి జాతీయ స్థాయి పోటీలో రాణించడం  తనకెంతో సంతోషంగా ఉందని తెలియజేశాడు.
తనకు సినిమాల్లో ఛాన్సులు వస్తే తన యొక్క నటనా నైపుణ్యాన్ని ప్రదర్శించి తెలంగాణ నుండి అద్భుతమైన హీరోగా ఎదిగి సమాజానికి తన వంతు సేవ చేస్తానన్నాడు.


రాకేష్ తన మిత్రులతో కలిసి గత తొమ్మిది సంవత్సరాలుగా సమాజ సేవ చేస్తున్నాడు ఇప్పటికీ జాతీయ మరియు అంతర్జాతీయ స్థాయిలో పలు అవార్డులు కూడా గెలుచుకున్నాడు.
తనకు తీరిక సమయం దొరికినప్పుడల్లా అనాధ ఆశ్రమాల్లో వృద్ధ  ఆశ్రమాలలో లైబ్రరీలలో ప్రభుత్వ స్కూల్లో పిల్లలతో గడుపుతానన్నాడు.
రాకేశ్ ఇలాంటి విజయాలు మరెన్నో అందుకోవాలని అదేవిధంగా సమాజానికి తన వంతు సహాయం అందించాలని కోరుకుందాం.


Mobile:8143459509
Gmail: rakesh.arre@gmail.com

Comments

Popular posts from this blog

పదవ తరగతి ఫలితాల్లో సత్తా చాటిన దారుల్షిఫా ప్రభుత్వ పాఠశాల అంధ విద్యార్థులు

What is after SSC and Intermediate