ఓ అధ్యాపకుడి ఆవేదన వినండి



💐💐💐💐💐💐💐💐
*మీ పిల్లల్ని మీరు నిజంగా ప్రేమిస్తున్నారా?*
💐💐💐💐💐💐💐💐
అయితే తప్పకుండా చదవగలరు

I.I.T ... NEET ... PREPARATION తెలుగు రాష్ట్రాల్లో ఒక సీరియల్ కిల్లర్ అయింది.

ఇందులో మీ పాత్ర కూడా ఉంది. కాలేజి, బోధకులు, తల్లిదండ్రుల కర్కశమైన ఆశలకు అమాయకులైన విద్యార్థులు ఎలా బలవుతున్నారో కాస్త

💐💐💐💐💐💐💐💐

*మీ పిల్లల్ని మీరు నిజంగా ప్రేమిస్తున్నారా?*

💐💐💐💐💐💐💐💐

అయితే తప్పకుండా చదవగలరు

I.I.T ... NEET ... PREPARATION తెలుగు రాష్ట్రాల్లో ఒక సీరియల్ కిల్లర్ అయింది.

ఇందులో మీ పాత్ర కూడా ఉంది. కాలేజి, బోధకులు, తల్లిదండ్రుల కర్కశమైన ఆశలకు అమాయకులైన విద్యార్థులు ఎలా బలవుతున్నారో కాస్త ఓపికగా చదవండి.

*20 ఏళ్ళుగా టాప్ బ్యాచ్‌కు ఐఐటి కోచింగ్ ఇస్తున్న

 ఓ అధ్యాపకుడి ఆవేదన  ఇది.*l

తల్లిదండ్రులుగా మీ తప్పు ఉంటే దయచేసి సరిదిద్దుకోండి. 

పిల్లల ప్రాణం కంటే ఏదీ ఎక్కువ కాదు. 

చదువుల పేరు మీద బిడ్డలను శాశ్వతంగా దూరం చేసుకోవడం అవసరమా?

మీరు ఎంత ధనవంతులైనా ఎంత పేరు ప్రఖ్యాతులున్నా మీ జీవితం శూన్యం. కాదంటారా?

*🅾ఇప్పుడు అసలు విషయంలోకి వద్దాం.*

దేశవ్యాప్తంగా 10 వేల సీట్ల కోసం ఐఐటి పరీక్షలు రాస్తున్న వారి సంఖ్య ఎంతో తెలుసా సగటున 13-14 లక్షల మంది విద్యార్థులు.

ఇది గుర్తుపెట్టుకోండి. ఇక చదవండి.

*🛑6వ తరగతి - నరకానికి ఎంట్రీ *

6వ తరగతి నుంచే మీరు టెక్నో స్కూలా ఒలంపియాడా అని అన్వేషణ మొదలు పెడతారు. 2005-06 నుంచి ఈ వెర్రి మొదలైంది. ఇక్కడ ఐఐటి ఫౌండేషన్ పేరుతో ఏం చేస్తారంటే ఇంటర్మీడియట్ సిలబస్‌ను విభజించి పిల్లలపై రుద్దుతారు. రెగ్యులర్ సిలబస్‌తో పాటు ఇది అదనం. ఆయా తరగతులకు ఎంత సిలబస్ ఉండాలో ఏమి వుండాలో పిల్లలు ఎంత భరించగలరో అది పాఠ్య పుస్తకాలుగా నిపుణులచే రూపొందించబడి ఉంటుంది. రెండు రాష్ట్రాల్లో మొత్తం విద్యార్థుల సంఖ్య 50 లక్షలకు పైగా ఉంది. ఈ అదనపు భారాన్ని మోయగలిగే విద్యార్థులు మాత్రం వేలల్లోనే ఉంటారు. ఈ కొన్ని వేల మందిని మినహాయిస్తే లక్షల సంఖ్యలో పిల్లలు ఒత్తిడికి గురవుతున్నారు. ప్రభుత్వం టెక్నొ ఒలింపియాడ్ అనే పేర్లు పెట్టకూడదు అని చట్టం చేసింది కానీ, సిలబస్ పై నియంత్రణ లేదు. పైగా వీటికి అదనపు ఫీజు వేసి దోచుకుంటున్నారు.

మరి వేలల్లో ఉన్న తెలివైన విద్యార్థుల పరిస్థితి ఏమిటి అంటారా?

బడి అయిపోగానే కాస్త రిలాక్స్ అవనిచ్చి మంచి ట్యూషన్లకు పంపవచ్చు.

పిల్లల్ని ఆడుకోనీయండి ఆనందంగా ఉండనివ్వండి. వారి జీవితపు పుస్తకంలో బాల్యం అనే పేజీలను చించివేయవద్దు.

విజయవాడలో ఓ స్కూల్ నుంచి ( ఇప్పుడు ఈ స్కూల్ చాలా ఫేమస్ ) రామయ్య గారి ఐఐటి కోచింగ్‌కి ఒకేసారి 40 మంది సెలెక్ట్ అయ్యారు. దీన్ని ఆ స్కూల్ బాగా అడ్వర్టైజ్ చేసుకుంది. దీన్ని ఇతర కార్పొరేట్ స్కూళ్లు అందిపుచ్చుకున్నాయి. ఇలా పాఠశాల స్థాయిలో విషబీజాలు పడ్డాయి.

ఒత్తిడితో కూడిన చదువులతో పిల్లల ఆత్మహత్యలకు నాంది పడింది. ఫౌండేషన్ కోర్సుల పేరుతో పిల్లకు జీవన్మరణ సమస్యగా మారాయి.

మీరు జాగ్రత్తగా గమనిస్తే 2005-06 తర్వాత విద్యార్థుల ఆత్మహత్యలు మొదలయ్యాయి. అవి అంతకంతకూ పెరిగిపోతున్నాయి.

*🛑ఇంటర్మీడియట్ - ప్రత్యక్ష నరకం*

మళ్ళీ మంచి నరకం ఎక్కడుంది అని వెతుకులాట ప్రారంభిస్తారు. అప్పటికే వందలాది ర్యాంకులు మావే అని ప్రకటనలు ఇచ్చిన కార్పొరేట్ కాలేజిని మీరు ఎన్నుకుంటారు. అసలు ర్యాంకుల మాయాజాలం గురించి తెలుసుకోండి. ర్యాంకులు వేరు సీట్లు వేరు. అన్ని ర్యాంకులకు సీట్లు వస్తాయనేది తప్పుడు ప్రచారం. అంతేకాదు రాష్ట్రంలోనే టాప్ 100 విద్యార్థుల తల్లిదండ్రులకు లక్షలు ఇచ్చి వారిని కొనేస్తారు. వారిని రాచిరంపాన పెట్టి ఈ ర్యాంకులను తెఛ్ఛుకుంటారు. అందరికీ ఇలాంటి ర్యాంకులు తెప్పిస్తారని మీరు భ్రమపడతారు. సరే మీరు ఏదో ఒక బుట్టలో పడతారు. పిల్లల్ని కాలేజిలో చేరుస్తారు. అక్కడ రకరకాల బ్యాచులు ఉంటాయి. విద్యార్థి సామర్థ్యాన్ని బట్టి అందులో వేస్తారు. కొన్ని టెస్టులు పెట్టి మార్కులు రాకపోతే తక్కువ స్థాయి బ్యాచికి పిల్లల్ని షిఫ్ట్ చేస్తారు. ఇక్కడ ఒత్తిడి ముదిరిపాకాన పడుతుంది. తమను టాప్ బ్యాచిలోనుంచి తీసివేస్తారనే టెన్షన్ పిల్లల్ని పీల్చిపిప్పి చేస్తుంది. క్లాసులు ప్రారంభం అయ్యాక ఐఐటి స్థాయి problems తో కుస్తీ పట్టలేక నైరాశ్యానికి గురవుతారు. ఆత్మస్థైర్యం దెబ్బతింటోంది. ఒక్కో సమస్య సాధించడానికి ఒకసారి 2 గంటలు కూడా పడుతుంది. ఇలా రోజులు గడిచేకొద్దీ పిల్లల్లో డిప్రెషన్ పెరిగి ఏదో ఒకరోజు ఆత్మహత్యకు దారితీస్తోంది.

ఎంత దుర్భర పరిస్థితుల్లో విద్యార్థులు చదువుకుంటున్నారో, తల్లిదండ్రులు కూడా ఐఐటి మాయలోపడి పిల్లల జీవితాల్ని బుగ్గిపాలు చేస్తున్నారో నా అనుభవాల్నే ఉదాహరణలుగా చెప్తాను.

లక్షలు పోసి మీరు చదివిస్తున్న కాలేజీల్లో పిల్లలకు కనీస సౌకర్యాలు ఎలా ఉంటాయో చూద్దాం.

*🏀నాసిరకం భోజనం*: నాన్నా ఫుడ్ అసలు బాగుండటం లేదు అని పిల్లలు చెప్తే పేరెంట్స్ సమాధానం - మీరు తినడానికి ఉన్నారా చదవడానికా అని. ఇదే ప్రశ్న ఖర్మగాలి పిల్లలు మేనేజ్మెంట్ ను అడిగితే వాళ్ళని ఎంతగా వేధిస్తారో మీకు తెలీదు.

*❇అపార్ట్‌మెంట్* : ఉదయం ఐదు గంటల నుంచి రాత్రి పదిన్నర గంటల వరకు అపార్ట్‌మెంట్‌లో మెట్లపై సెల్లార్ నుండి 6 వ్స్ అంతస్తుకు రోజుకు 10 సార్లకు పైగా మెస్సుకు క్లాసులకు ఎక్కి దిగుతూ మీ బిడ్డ అనుభవిస్తున్న నరకయాతన వర్ణనాతీతం

*✴తల్లిదండ్రులు*: విజిటింగ్ టైంలో బిడ్డ కనబడగానే దగ్గరకు తీసుకుని ప్రేమగా మాట్లాడేఅ పేరెంట్సును చాలా తక్కువ మందిని చూశాను. పోయిన వారం నీ మార్కులు చాలా తక్కువ వచ్చాయి ఏమి చేస్తున్నావు చదవడం లేదా అని గద్దించే తల్లిదండ్రులను అధికంగా చూశాను. అప్పుడు పిల్లలు ఎంతగాకుచించుకు పోయింటారు?

ఒక మారుమూల పల్లెటూళ్లో 2000 సంవత్సరంలో నా ముందు జరిగిన సంఘటన చెబ్తాను.

స్కూలు యాజమాన్యం ప్రతి ఆదివారం విద్యార్థులకు టీచర్లకు సెలవు ఇచ్చేవారు. అయితే కొంతమంది విద్యార్థుల పేరెంట్స్ ప్రతి వారం సెలవులు ఇస్తే సంవత్సరంలో 52 రోజులు వృధా అవుతాయి ఇలా అయితే మా పిల్లల ర్యాంకులు చైతన్య నారాయణ విద్యార్థుల కంటే తక్కువ వస్తాయి అని ఆదివారం సెలవు రద్దు చేయించారు. అక్కడ పనిచేసే స్టాఫ్కు ప్రతి 15 రోజులకు ఒకసారి ఆఫ్ ఉంటుంది కాని విద్యార్థులకు మాత్రం సెలవు లేదు. మరి విద్యార్థులకు మానసిక ఒత్తిడి పెరగక ఏం జరుగుతుంది ?

విచారంచాల్సిన విషయం ఏమంటే అనేకసార్లు ఆ కాలేజీ ప్రభుత్వంచే అవార్డులు తీసుకుంది.

*అధ్యాపకులు*: పిల్లల ప్రోగ్రెస్ పెంచుకుంటూ పోవడానికి అధ్యాపకులపై టన్నుల కొద్దీ ఒత్తిడి ఉంటుంది. వ్యక్తిగత జీవితాలు లేక మనశ్శాంతి కరువై అధ్యాపకుల మానసిక స్థితిని భ్రష్టు పట్టిస్తున్నాయి కాలేజి యాజమాన్యాలు. రకరకాల ఫ్రస్ట్రేషన్లను అధ్యాపకులు వదిలించుకునేది తమ విద్యార్థుల దగ్గర. ఏదో ఒక సందర్భంలో వారు పిల్లలను కొట్టడం తిట్టడం జరుగుతుంది. పిల్లలు అవమానభారం తట్టుకోలేక కుంగిపోయి ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.

*యాజమాన్యం*: వీలైనన్ని ఎక్కువ ర్యాంకులు తెచ్చుకుని వచ్చే సంవత్సరం మరిన్ని అడ్మిషన్లు సాధించాలి మరింత డబ్బు సంపాదించాలి. ఈ ప్రక్రియలో ఎవరు ఏమైనా ఫర్లేదు మాకు అడ్మిషన్లు పెరగాలి. అంతులేని ధన దాహం. పిల్లల ప్రాణాలంటే లెక్కలేదు. తిలాపాపం తలా పిడికెడు.

కాలేజిల సంగతి పక్కనపెట్టి మీ వరకు పిల్లల్ని ఈ నరకకూపాల్లో పడకుండా జాగ్రత్తపడండి.

ఈ సమస్యకు మరి పరిష్కారాలు ఏమిటి?

*ప్రభుత్వం*: అపార్టుమెంటుల్లో స్కూళ్ళు కాలేజీలు నడపకుండా చర్యలు తీసుకోవాలి.

తమిళనాడు తరహాలో అన్ని మౌలిక సౌకర్యాలు ఉంటేనే అనుమతి ఇవ్వాలి.

టెక్నో ఒలింపియాడ్ వంటి అదనపు సిలబస్ తొలగించి ప్రభుత్వం సూచించిన సిలబస్ మాత్రమే చెప్పాలి

*రెసిడెన్షియల్లో స్టడీ టీచింగ్ కలిపి 8 గంటలు దాటకూడదు*

*గేంస్ పీరియడ్ కచ్చితంగా ఉండాలి*

*టైమింగులు ప్రభుత్వ స్కూళ్ళు కాలేజీలతో సమానంగా ఉండాలి*

*వారం వారం పరీక్షలు నిషేధించాలి *

జిల్లా మొత్తానికి ఒకే యాజమాన్యం కింద ఒకటి లేదా రెండు స్కూళ్ళు/కాలేజీల కంటే ఎక్కువ వుండరాదు

*తల్లిదండ్రులు*:

ప్రకటనలు చూసి మోసపోవద్దు

అపార్ట్‌మెంటుల్లో నడిపే బడులు కాలేజీల్లో మీ పిల్లల్ని చేర్పించవద్దు.

చిన్న వయసులోనే పిల్లల్ని హాస్టళ్ళలో వేయకండి.

మీ పిల్లలకు నిజంగా సామర్థ్యం ఉందో లేదో చెక్ చేసుకోండి

వారికి సామర్థ్యం లేదు అనుకుంటే ఐఐటి నీట్ కంటే చక్కటి ప్రత్యామ్నాయాలు చాలా ఉన్నాయి.

పిల్లల ఇష్టాయిష్టాలకు విలువనివ్వండి. వారికి నచ్చిన కోర్సులను చదవనీయండి. 

మార్కులు తక్కువ వచ్చాయని వేధించకండి, సరిగా చదవకపోతే అందుకు గల కారణాలను తెలుసుకోండి. ఇతరులతో పోల్చకండి. 

*🔵మార్కులు రాకపోయినా వారు మన బిడ్డలే.*

*ఇంజనీర్లు డాక్టర్లు కానంత మాత్రాన వారికి మీ మనసులో ఈ సమాజంలో చోటు ఉండదా?*

*కాలేజిలు స్కూళ్ళు చేయాల్సినవి* 

( ఇది దురాశే అయినా కనీసం తెలుసుకుందాం )

ప్రభుత్వం నిర్దేశించిన మేరకే స్కూల్ టైమింగ్స్ ఉండాలి.

అదనపు సిలబస్ ఉండరాదు.

మీ ర్యాంకులు డబ్బు పిచ్చివల్ల పిల్లలు పిట్టల్లా రాలిపోతున్నారు. మానవత్వంతో మెలగండి. వారి ఉసురు పోసుకోకండి.

మార్కులను బట్టి పిల్లల సెక్షన్లు మార్చకండి.

హాస్టళ్లలో కనీస వసతి కల్పించండి.

ఇవండీ నా అభిప్రాయాలు. ఓపిగ్గా చదివినందుకు ధన్యవాదాలు🙏🏻.

*చివరగా మరోసారి నా విన్నపం...*

పిల్లలకు చిన్న దెబ్బతగిలితే విలవిలలాడిపోయే మనం చదువు విషయంలో చాలా క్రూరంగా ప్రవర్తిస్తున్నాము.

*పిల్లలు కోల్పోయిన తల్లిదండ్రులను ఒకసారి అడిగి చూడండి. ఒక్కముక్క చదువు రాకపోయినా పర్వాలేదు నా బిడ్డ నాకు ఉంటే చాలు నేను చచ్చేదాకా అడుక్కుతిని అయినా పోషించుకుంటాను అని అంటారు*.

మన ఆశలకు ఆశయాలకు ఫాల్స్ ప్రిస్టేజిలకు పిల్లల్ని సమిధల్ని చేయడం తప్పు. 

మీ పిల్లలు వారి ఇష్టాలకు అనుగుణంగా చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆశిస్తున్నాను.       

                                

Ref By: Dr PRATHYUSHA SUBBARAO PSYCHOLOGIST ఓపికగా చదవండి.

Comments

Popular posts from this blog

పదవ తరగతి ఫలితాల్లో సత్తా చాటిన దారుల్షిఫా ప్రభుత్వ పాఠశాల అంధ విద్యార్థులు

What is after SSC and Intermediate