పదవ తరగతి ఫలితాల్లో సత్తా చాటిన దారుల్షిఫా ప్రభుత్వ పాఠశాల అంధ విద్యార్థులు

పదవ తరగతి ఫలితాల్లో సత్తా చాటిన దారుల్షిఫా  ప్రభుత్వ 
పాఠశాల అంధ విద్యార్థులు:
ఈరోజు ఉదయం ప్రకటించిన తెలంగాణ పదవ తరగతి ఫలితాల్లో పాతబస్తీలోని గల దారుల్షిఫా ప్రభుత్వ అంధుల పాఠశాలలో గల విద్యార్థులు తమ యొక్క ప్రతిభను చాటారు.
తమకు కళ్ళు లేకున్నా టాలెంట్ ఉంది అంటూ అందరి విద్యార్థులతో పోటీపడుతూ ఫలితాలలో అద్భుతంగా రాణించారు.
మొత్తం 11 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా ఇందులో ఇద్దరు విద్యార్థులు 9.2 gpa సాధించగా మిగిలిన తొమ్మిది విద్యార్థులు 8 మరియు ఆపై GPA సాధించి టాలెంట్ లో  ఎవరికి తక్కువ కాదు అని వారి యొక ప్రతిభను చూపించారు.
ఈ యొక్క ఫలితాల పట్ల స్కూల్ ప్రిన్సిపల్ మరియు వారి తల్లిదండ్రులు ఎంతో సంతోషం వ్యక్తం చేశారు.
విద్యార్థులు మాట్లాడుతూ తమ తల్లిదండ్రులు, స్కూల్ యాజమాన్యం, మరియు scribes మాకు ఎంతగానో సహకరించారు.
అంటూ వారి యొక్క సంతోషాన్ని పంచుకున్నారు.
ఇదే స్ఫూర్తితో తమ యొక్క చదువును కొనసాగించి తమ  లక్ష్యాలను నెరవేర్చుకొని సమాజానికి సేవ చేస్తామని తెలియజేశారు.



Comments

Popular posts from this blog

Worldwide Live Corona Upadated cases